ఆదిలాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలలో వివిధ కేసులు పట్టుబడిన వాహనాలకు గాను గురువారం వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ విజేందర్ తెలిపారు. 15 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో వేలం వేయనన్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ప్రభుత్వం నిర్దేశించబడిన ధరావతు సొమ్మును చెల్లించి బహిరంగ వేలం పాటలు పాల్గొనవచ్చు అని వెల్లడించారు.