E.G: కొవ్వూరు మండలం ఐ.పంగిడి గ్రామానికి చెందిన జనసేన నాయకుడు పీకే రంగారావు మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే గ్రామస్థులు, పార్టీ కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పార్టీ అభివృద్ధికి కృషి చేసిన రంగారావు సేవలను నేతలు స్మరించుకున్నారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.