NLR: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్షలు చేపట్టే ముస్లిం సోదరుల సౌకర్యార్థం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వాటర్ కూలర్ల వితరణ చేశారు. బుచ్చిరెడ్డి పాళెం మండలంలోని దామరమడుగు, పెనుబల్లి వవ్వేరు, చెల్లాయపాలెం, పంచేడు గ్రామాలలోని 5 మసీదు కమిటీ సభ్యులకు వీటిని అందజేశారు. మసీదులోకి వచ్చే ముస్లింల సౌకర్యార్థం కూలర్లను ఇచ్చినట్లు ఆమె తెలిపారు.