IT దిగ్గజం ఇన్ఫోసిస్ ఫ్రెషర్లకు శుభవార్త చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే ప్రణాళికలో ఉన్నట్లు ఆ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(CFO) జయేష్ సంఘ్రాజ్కా తెలిపారు. మరోవైపు 2025-26 చివరి త్రైమాసికం(Q4)లో రూ.8,501 కోట్లతో 20.8% వృద్ధి సాధించినట్లు నిన్న ఇన్ఫోసిస్ ప్రకటించింది. దీంతో 2025-26లో కంపెనీ నికర లాభం రూ.29,440 కోట్లుగా నమోదైంది.