తూ.గో: వేసవి సెలవుల దృష్ట్యా IRCTC ప్రత్యేక ప్యాకేజీతో పాటు భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లను నడుపుతోందని ఏరియా మేనేజర్ ఎం రాజా వెల్లడించారు. బుధవారం రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఆయన మాట్లాడారు. జూన్ 3న సికింద్రాబాద్ నుంచి అయోధ్య, కాశీ, యమున పుష్కరాలను కవర్ చేస్తూ ప్రత్యేక రైలు వెళ్లనుందని తెలిపారు. యాత్రికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.