AP: శ్రీకాకుళం నగరంలోని అతిసారం ప్రభావిత ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా మృతుడు సురేష్ కుటుంబాన్ని పరామర్శించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రితోపాటు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి పరామర్శించారు.