మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ మహమ్మదాబాద్ మండల కేంద్రంలోని ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల వద్ద అన్ని రకాల మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని సూచించారు.