AP: అసెంబ్లీని సందర్శించిన పల్నాడు జిల్లా సత్తెనపల్లి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులతో మంత్రి లోకేష్ ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. కెరీర్ కోసం ఇంగ్లీష్ నేర్చుకున్నప్పటికీ, అమ్మలాంటి మాతృభాష తెలుగును మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దని ఆయన విద్యార్థులకు హితవు పలికారు.