AP: శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ చల్లా కూర్మారావుపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. నగరంలో డయేరియా ప్రబలడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఉన్నతాధికారుల నివేదికలో తేలింది. పారిశుద్ధ్య నిర్వహణ, రక్షిత మంచినీటి సరఫరాలో విఫలమైనందుకు ఈ చర్యలు తీసుకున్నారు. ప్రజారోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు బాధ్యుడిగా చేస్తూ ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.