TG: నాగర్ కర్నూల్ జిల్లాలో మాజీమంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కుమ్మెర జాతర ఘటన బాధితుల దీక్షాస్థలికి ఆయన చేరుకున్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అలాగే ఈ ఘటనలో మరణించిన చిన్నారి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. కాగా, చిన్నారి మృతి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.