TPT: తిరుపతి జిల్లా కరకంబాడిలోని అమర రాజా విద్యాలయంలో 30వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అవసరమని సూచించారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకోగా, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.