సత్యసాయి: పెనుకొండ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో మూడు నెలల బ్యూటీషియన్ థెరపీ సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసిన మహిళలకు ఇవాళ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్బంగా క్యాంప్ కార్యాలయంలో మంత్రి సవిత 50 మంది మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని అన్నారు.