ATP: రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన ప్రసిద్ధ శ్రీ స్వయంభు జంబుకేశ్వరుడు బెల్లం అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చాడు. బుధవారం వేకువ జామునే స్వామి మూల విరాట్కు పంచామృత, రుద్రాభిషేకం వివిధ అభిషేకాలు చేపట్టి బెల్లంతో విశేషంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. స్వామివారి విశేష అలంకరణను భక్తులు దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు.