PDPL: గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో పలు పాఠశాలల్లో నిన్న ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు పాఠశాల విద్యార్థులు తమ తండ్రులకు రోడ్డు భద్రతపై భావోద్వేగంతో లేఖలు రాశారు. “నాన్నా.. మా కోసం హెల్మెట్ ధరించండి, నిబంధనలు పాటించండి” అంటూ పోస్ట్ కార్డుల ద్వారా విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటాన్నారన్నారు.