అనకాపల్లి జిల్లాలో నేటి అర్ధరాత్రి నుంచి సముద్రంలో వేటనిషేధం అమలులోకి రానుంది. జూన్ 14 వరకు వేట నిషేధం కొనసాగుతుంది. సముద్రంలో చేపల సంతాన ఉత్పత్తికి అంతరాయం కలగకుండా ప్రతి ఏట మే 14 నుంచి జూన్ 15 వరకు ప్రభుత్వం వేట నిషేధాన్ని అమలు చేస్తుంది. జిల్లాలో 31 మత్స్యకార గ్రామాల్లో 12,644 మంది మత్స్యకారులకు ప్రభుత్వం వేట నిషేధ సమయంలో భృతిని అందజేస్తుంది.