ADB: సంక్షేమ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే టీజీసెట్ (TGCET-2026)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉట్నూర్ లాల్ టెక్డి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ హరిరామ్ తెలిపారు. ఈ నెల 22న (ఆదివారం) ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లతో పాటు అరగంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలన్నారు.