TG: నిజామాబాద్లో మహిళా న్యాయవాదిపై జరిగిన దాడి వార్త తనను తీవ్రంగా కలచివేసిందని BJP చీఫ్ రామచందర్ రావు తెలిపారు. ‘రాష్ట్రంలో చట్టం-వ్యవస్థ పరిస్థితి క్షీణిస్తుంది. పౌరుల భద్రతను కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఒక న్యాయవాదిపై దాడి జరగడం అంటే అది ప్రజాస్వామ్యంపై నేరుగా జరిగిన దాడిగా భావించాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.