SRD: సమగ్ర సస్యరక్షణ చేపడితే పంట అధిక దిగుబడులు సాధించవచ్చని ఖేడ్ ADA నూతన్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం సిర్గాపూర్ మండలం వాసర్ గ్రామంలోని రైతు వేదికలో రైతులకు సమావేశపరిచి పంటల సాగు పద్ధతులపై అవగాహన కల్పించారు. రబీ సీజన్ పంటలు పూర్తవగానే చేనులో వేసవి దుక్కులు దున్నడం అవసరమని సూచించారు. సకాలంలో సస్యరక్షణలు చేపడితే పంట భూమిలో కీటకాలు ఉండవన్నారు.