అన్నమయ్య: మంగళవారం అసెంబ్లీలో RTC డిస్పెన్సరీలు, ఉద్యోగుల ఆరోగ్య పథకంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమాధానం ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 19 డిస్పెన్సరీలు, విజయవాడలో సెంట్రల్ ఆసుపత్రి ద్వారా 45 వేల RTC ఉద్యోగులకు వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.EHS పథకం కింద 1,900 ఆసుపత్రుల్లో ఉద్యోగులు, వారి కుటుంబాలకు చికిత్స సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.