PDPL: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన బీమా పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని UBI మేనేజర్ శివ బాలు తెలిపారు. మంగళవారం నంది మేడారంలో ఆర్థిక అక్షరాస్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో CFL కౌన్సిలర్స్ సుజాత, జ్యోతి పాల్గొన్నారు.