VSP: విశాఖ సాహితీ సంస్థ 56వ వార్షికోత్సవ వేడుకలు ద్వారకానగర్ గాయత్రి విద్యా పరిషత్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి వై.వి. అనురాధ ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్తరాంధ్ర సాహిత్యానికి విశాఖ సాహితీ విశేష సేవలందిస్తోందని పేర్కొన్నారు. ఉభయ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రముఖులు సాహితీ కార్యక్రమాలను ప్రశంసించారు.