VZM: మిషన్ హార్టి విజన్లో భాగంగా జిల్లాలో రెండో విడతలో 7260 ఎకరాల్లో మొక్కలు నాటేందుకు జూన్ నాటికి భూములను సిద్ధం చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 275 బ్లాక్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.