KNR: ఈ నెల 14న హుజూరాబాద్లో నిర్వహించే అంబేద్కర్ 136వ జయంతి ఉత్సవాలకు కమిటీ చైర్మన్గా ఆడేపు సురేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం హుజురాబాద్ క్లబ్లో ఎన్నికలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కమిటీ అధ్యక్షులు మారేపల్లి శ్రీనివాస్, కౌన్సిలర్లు సమ్మయ్య, మొగిలి, నాయకులు ఆలేటి రవీందర్, వేల్పుల రత్నం, తదితరులు పాల్గొన్నారు.