AKP: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖలో నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ లాబొరేటరీ (NSTL)లో లార్జ్ కేవిటేషన్ టన్నెల్ (LCT) ప్రాజెక్టుకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ అత్యాధునిక సదుపాయం డీఆర్డివో ఆధ్వర్యంలో నిర్మాణం కానుంది. నౌకల హైడ్రోడైనమిక్ పరిశోధన, పరీక్షలను దేశీయంగా నిర్వహించేందుకు ఇది దోహదం చేస్తుంది.