భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో విదేశీ మదుపరులు(FII) పెద్దఎత్తున షేర్లను విక్రయించడంతో మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ ఏకంగా 1400 పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 400 పాయింట్లకు పైగా పతనమైంది. దాదాపు 2 శాతం మేర నష్టాలు నమోదు కావడంతో ఇన్వెస్టర్ల సంపద భారీగా ఆవిరైంది.