KMR: తమకు రావలసిన బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్ పాఠశాలకు తాళం వేశారు. ఈ ఘటన బుధవారం భిక్కనూర్ మండలం ఈసన్నపల్లిలో జరిగింది. గత ప్రభుత్వ హయాంలో మనబడి పథకం కింద రూ.20 లక్షల వ్యయంతో పాఠశాల భవనాన్ని నిర్మించారు. ఇప్పటి వరకు బిల్లులు రాకపోవడంతో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను బయటకు పంపి తరగతి గదులకు తాళాలు వేశారు.