హ్యుందాయ్ కార్ల ధరలు మరింత ప్రియం కానున్నాయి. పలు మోడళ్లపై రూ.12,800 వరకు ధరలు పెంచనున్నట్లు కంపెనీ వెల్లడించింది. పెంచిన ధరలు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. తయారీ ఖర్చులు, నిర్వహణ వ్యయాలు పెరగడం వల్లే ఈ పెంపు నిర్ణయం తీసుకున్నట్లు ఆటోమొబైల్ కంపెనీ స్పష్టం చేసింది. ఇటీవల మారుతీ సుజుకీ కూడా కార్లపై రూ.30 వేల వరకు ధరలు పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.