WGL: కమిషనరేట్ పరిధిలో ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న తమిళనాడుకు చెందిన నిందితులను వరంగల్ CCS, హన్మకొండ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేసినట్లు సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.15.20 లక్షల నగదు, 95 గ్రాముల బంగారం, ఒక ద్విచక్ర వాహనం, రెండు సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.