MBNR: మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని 12వ వార్డులో ఉన్న స్మశాన వాటికలో అన్ని రకాల వసతులు కల్పిస్తామని డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన 12వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్ ప్రజలు ఆయన దృష్టికి పలు సమస్యలను తీసుకొచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కురువ సత్యం, నాయకులు మైత్రి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.