JN: కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని కోరుతూ లింగాల గణపురం తహసీల్దార్ కు బీజేపీ నేతలు వినతిపత్రం అందజేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు సంపత్ యాదవ్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ వెంటనే అమలు చేసి ప్రజాసంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
KNR: వివిధ శాఖల అధికారులు సమన్వయంతో రోడ్డు భద్రతా చర్యలు తీసుకుంటూ ప్రమాదాలు నివారించాలని, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ.. ప్రమాదాలు జరిగే చోట్లను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు.
BDK: జిల్లా కలెక్టర్ అంకిత్ శ్రీరామనవమి ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, రవాణా సౌకర్యాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఏరియా ఆసుపత్రిలో 30 ప్రత్యేక పడకలను అందుబాటులో ఉంచాలని, ఐటీసీ (ITC) ఆధ్వర్యంలోని బ్రిడ్జ్ లైటింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
MDCL: ప్రగతినగర్లో 9 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా రక్షణ కల్పించింది. అంబీర్ చెరువుకు ఆనుకుని ఉన్న 5 ఎకరాల స్మశానవాటిక, పక్కనే ఉన్న 4 ఎకరాల డంపింగ్ యార్డు స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయనే ఫిర్యాదులపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కూకట్పల్లి మండలం బాగామేరి గ్రామం సర్వే నం.103లో ఉన్న ఈ భూమిని ప్రభుత్వ భూమిగా నిర్ధారించారు.
KMM: చింతకాని, బోనకల్, మధిరలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను జిల్లా వ్యాక్సిన్ మేనేజర్ రమణ మంగళవారం తనిఖీ చేశారు. టీకాల నిల్వ ఉష్ణోగ్రతలు, రికార్డులను పరిశీలించి కోల్డ్ చైన్ నిర్వహణపై సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం మధిర ఆసుపత్రిలో హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు 14 ఏళ్ల లోపు బాలికలకు ఈ టీకా వేయించాలని కోరారు.
ADB: ప్రజలు మూఢనమ్మకాలతో జడిబుట్టిలను నమ్మి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సిరికొండ మండలం పాలవాగు గ్రామంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించి, రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు.
JGL: బీర్పూర్ మండలం తాళ్లధర్మారం ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఉప వైద్యాధికారి డా. శ్రీనివాస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ, ఫార్మసీ నిల్వ, అటెండెన్స్ రిజిస్టర్లను పరిశీలించారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో CHO ఖుద్దూస్, సూపర్వైజర్ తార, MLHP సీత, ఏఎన్ఎం, తదితరులు పాల్గొన్నారు.
SDPT: కుకునూరుపల్లి మండలం లకుడారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ హైమావతి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. అనంతరం పదవ తరగతి గదిని సందర్శించి, పరీక్షల సమయంలో సమయాన్ని వృథా చేయకుండా కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
GDWL: విద్యార్థుల మధ్య పోటీలు వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి అని గట్టు మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గట్టు మండల స్థాయి క్విజ్ పోటీలు నిర్వహించారు. హోరాహోరీగా సాగిన ఈ పోటీల్లో ఎంపీపీఎస్ బల్గేరా (హరిజనవాడ) ప్రథమ స్థానంలో నిలబడ్డాడు. ఈ సందర్భంగా అతన్ని అందరూ అభినందించారు.
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వనపర్తి కలెక్టరేట్ను ఆశాకార్యకర్తలు ముట్టడించారు. అనంతరం నిర్వహించిన ధర్నాకార్యక్రమాన్ని ఉద్దేశించి నేతలు రమేష్, మండ్ల రాజు మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో దగాపడ్డ ఆశవర్కర్లు కాంగ్రెస్పై ఆశలు పెంచుకొని ఎన్నికలలో మద్దతు ఇచ్చిన ఆశవర్కర్ల హామీలను సీఎం రేవంత్ రెడ్డి విస్మరించారని విమర్శించారు.
HYDలో మెహదీపట్నం స్కైవాక్ నిర్మాణం శరవేగంగా సాగుతుందని అధికారులు తెలిపిన సంగతి తెలిసిందే.కానీ..బ్రిడ్జి కింద నుంచి స్కైవాక్ అతి తక్కువ ఎత్తులో వాహనాలకు తాకేలా నిర్మిస్తున్నారని, ఈ ఫోటో చూస్తే స్పష్టంగా అర్థమవుతుందని పలువురు నెటిజన్లు అధికారులకు ట్వీట్లు చేస్తున్నారు. భారీ వాహనాలు వెళితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.
NZB:షెడ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ ద్వారా స్వయం ఉపాధి పథకాలకు అర్హులైన ఎస్సీ యువత నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు MPDO బాలకిషన్ తెలిపారు. వార్షిక ఆదాయం రూ.1,50,000 లక్షల లోపు ఉన్నవారు ఈనెల 24వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. చిన్న తరహా వ్యాపారాలకు బ్యాంకుల సహకారంతో రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.
నల్లగొండ, మీర్భాగ్ కాలనీలో ఐద్వా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరీమణులకు మంగళవారం ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ మాట్లాడుతూ.. రంజాన్ మాసం త్యాగానికి, సోదరభావానికి ప్రతీక అని కొనియాడారు. మతసామరస్యంతో అందరూ కలిసిమెలిసి ఉండాలని, భిన్నత్వంలో ఏకత్వమే మన సంస్కృతి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
NGKL: జిల్లా అభివృద్ధికి ఎంతో కీలకమైన జనాభా గణనలో ఎలాంటి తప్పులు లేకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ఐడీవోసీ సమావేశ మందిరంలో జరిగిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. భారతదేశ చరిత్రలో తొలిసారి డిజిటల్ విధానంలో జనాభా గణన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.
NGKL: జిల్లా అభివృద్ధికి ఎంతో కీలకమైన జనాభా గణనలో ఎలాంటి తప్పులు లేకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ఐడీవోసీ సమావేశ మందిరంలో జరిగిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. భారతదేశ చరిత్రలో తొలిసారి డిజిటల్ విధానంలో జనాభా గణన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.