SRPT: నూతనకల్ మండలంలోని మిర్యాల గ్రామ సర్పంచ్ అనంతుల శ్రీనివాస్ మాతృమూర్తి ఆదివారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న తుంగతుర్తి మార్కెట్ కమిటీ ఛైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి సోమవారం వారి నివాసానికి చేరుకుని, మృతురాలి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
KMM: ముదిగొండ MRO కార్యాలయంలో రంజాన్ పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం అందిస్తున్న రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుల పూవాళ్ళ దుర్గా ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ముస్లిం సోదరులు ప్రభుత్వం అందించిన రంజాన్ తోఫాను ఆయన అందజేశారు.
HYD: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నూతనంగా నియమితులైన బీజేపీ అధికార ప్రతినిధులు, మీడియా ప్యానెలిస్టులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పాల్గొని వారికి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తూ, పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు తీసుకెళ్లే వ్యూహాలపై చర్చించారు.
ADB: ఆదిలాబాద్లోని పోలీస్ కాలనీలో సోమవారం పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. డీవీ స్కూల్ సమీపంలో ప్రదీప్ అనే వ్యక్తిపై ఒక్కసారిగా దాడి చేసి కాలుపై తీవ్రంగా కరిచింది. గాయపడిన బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కాలనీలో కుక్కల బెడద విపరీతంగా పెరిగిందని, బయటకు రావాలంటేనే భయమేస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
KNR: శంకరపట్నం మండలం కేశవపట్నంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా మధ్యాహ్న భోజన వర్కర్లను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. జిల్లా అధ్యక్షుడు బొజ్జ సాయిలు, జిల్లా కార్యదర్శి కొండ రజితలను అరెస్టు చేయడం దుర్మార్గమని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పిట్టల సమ్మయ్య విమర్శించారు. ఈ మేరకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
MNCL: కవ్వాల్ అభయారణ్యంలో చిరుత పులిని హతమార్చిన ముగ్గురు వ్యక్తులను రిమాండ్కు తరలించామని తాళ్లపేట ఎఫ్ఆర్ఓ సుష్మ రావు తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. ముడితె వెంకటేష్ క్లచ్ వైర్తో ఉచ్చును ఏర్పాటు చేయగా చిరుత పులి చిక్కుకొని మృతి చెందిందన్నారు. ఆయనకు ముడితె శ్రీనివాస్, వనపర్తి శ్రీకాంత్ సహకరించారని వారిని కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించామన్నారు.
SRCL: గంభీరావుపేట మండలం రాజేశ్వర్రావు కాలనీలో ఉపాధి హామీ పనులను సర్పంచ్ పిట్ల బాబు సందర్శించారు. గ్రామస్థులు అందరూ ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పనుల వేళలో ఎండలు ముదురుతుండటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ పంచాయతీ కార్య దర్శి భరత్, వార్డు సభ్యులు పాల్గొన్నారు
RR: తండాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఫరూఖ్ నగర్ మండలం మొండోనిరాయి తండాలో రేషన్ షాపును ఆయన ఇవాళ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గిరిజనుల శుభకార్యాలు నిర్వహించుకునేందుకు షాద్నగర్ పట్టణంలో కమ్యూనిటీ భవనాన్ని నిర్మిస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి గిరిజన సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు.
KNR: కరీంనగర్ నగరానికి మణిహారాలైన కేబుల్ బ్రిడ్జి అనుబంధ పనులు, మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులపై ఈ అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టత వస్తుందని జిల్లా వాసులు ఆశిస్తున్నారు. అటు కరీంనగర్-వీణవకం రహదారి విస్తరణ, మరమ్మతులు, కల్వల ప్రాజెక్టు ఆధునీకరణ పనులకు కూడా ఈ బడ్జెట్లోనైనా ప్రాధాన్యత దక్కుతుందో లేదోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
BDK: రాష్ట్రంలో అత్యంత దీన స్థితిలో ఉన్న ఆటో డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆటో సంఘం రాష్ట్ర నాయకులు వేల్పుల భాస్కర్ ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమాజంలో అందరి జీవితాలు మారుతున్న గాని ఆటో డ్రైవర్ల జీవితాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని, ఆటో డ్రైవర్లపై ప్రభుత్వానికి చిన్నచూపు ఎందుకని ప్రశ్నించారు.
VKB: వేసవిలో పాదచారుల దప్పిక తీర్చేందుకు కొడంగల్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డిప్యూటీ DMHO రవీందర్ యాదవ్, SI సత్యనారాయణ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణానికి వచ్చే ప్రజల సౌకర్యార్థం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.
HNK: కాకతీయ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ‘కెమికల్ సైన్సెస్ ప్రస్తుత పరిశోధనలు (CRCS-2026)’ అనే అంశంపై నేటి నుంచి 2 రోజుల జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. వర్సిటీ పరిపాలన భవనంలోని సెనేట్ హాల్లో జరిగే ఈ కార్యక్రమానికి వీసీ ప్రతాప్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. IICT (HYD) చీఫ్ సైంటిస్ట్ గంగాగ్నిరావు కీలకోపన్యాసం చేస్తారు.
HNK: కాకతీయ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ‘కెమికల్ సైన్సెస్ ప్రస్తుత పరిశోధనలు (CRCS-2026)’ అనే అంశంపై నేటి నుంచి 2 రోజుల జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. వర్సిటీ పరిపాలన భవనంలోని సెనేట్ హాల్లో జరిగే ఈ కార్యక్రమానికి వీసీ ప్రతాప్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. IICT (HYD) చీఫ్ సైంటిస్ట్ గంగాగ్నిరావు కీలకోపన్యాసం చేస్తారు.
NGKL: జిల్లా కేంద్రంలోని అత్యంత రద్దీగా ఉండే శ్రీపురం చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు ఎటు నుంచి వస్తున్నాయో తెలియక అయోమయంగా మారి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి సిగ్నల్ లైట్లను పునరుద్ధరించాలని కోరుతున్నారు.
KMM: ముదిగొండ మండలం సువర్ణపురంలో ఓ డిగ్రీ కళాశాల ఎన్సీసీ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల ప్రత్యేక శిబిరం ఇవాళ ప్రారంభమైంది. సుమారు 50 మంది విద్యార్థులు గ్రామ వీధులు, బహిరంగ ప్రదేశాల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించి శ్రమదానం చేశారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్థులకు అవగాహన కల్పించారు.