KMM: పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కార్యదర్శి బండారు ఐలయ్య డిమాండ్ చేశారు. మంగళవారం ఖమ్మంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలని, యుద్ధాన్ని సాకుగా చూపించి గ్యాస్ ధరలు పెంచడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.