సిరిసిల్ల జిల్లా 33వ వార్డులోని బీవై నగర్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో కామదహనం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి 33వ వార్డు కౌన్సిలర్ కొండ నరేష్ హాజరై మాట్లాడారు. ప్రజలందరూ నిండు పున్నమిలా సుఖసంతోషాలతో ఉండాలని, ఆత్మీయతలను పంచుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గాజుల శ్రీనివాస్, సిరిమల్లె సత్యం, ఆడెపు శ్రీనివాస్, సాప శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.