KMM: సుజాతనగర్ మాజీ ఎమ్మెల్యే బొగ్గారపు సీతారామయ్య సతీమణి రుక్మిణమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. 1977-81 మధ్య ఎమ్మెల్యేగా సేవలందించిన సీతారామయ్య కుటుంబంలో ఈ మృతి విషాదం నింపింది. ఏన్కూర్ మండలం బీఆరపురం గ్రామంలో కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. పలువురు రాజకీయ నాయకులు నివాళులర్పించి సానుభూతి తెలిపారు.