NRML: జిల్లాలో ఇసుక అమ్మకాలను ‘మన ఇసుక వాహనం’ యాప్ ద్వారానే నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. పారదర్శకత కోసం ఆన్లైన్ కూపన్లు జారీ చేయాలని, భూ భారతి, ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలను నిర్ణీత సమయంలో అందజేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.