మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 42వ డివిజన్ అభివృద్దికి కట్టుబడి ఉంటానని కార్పొరేటర్ చిందం సత్యవతి శ్రీనివాస్ అన్నారు. డివిజన్ పరిధిలోని గౌతమేశ్వర కాలనీలో అధ్యక్షుడు లక్కాకుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలో సమగ్ర ప్రణాళికతో మున్సిపల్ అభివృద్ధికి పాటుపడతానని పేర్కొన్నారు.