WNP: గోపాల్ పేట మండలంలోని 15 గ్రామ పంచాయతీల వార్డు సభ్యులకు శిక్షణ శిబిరం ప్రారంభమైంది. సోమవారం ఎంపీడీవో ఆయుష్ అంజుమ్ కార్యాలయంలో శిక్షణ ప్రారంభమైంది. వార్డు సభ్యులు తమ వార్డులలో పథకాలు ప్రజలకు ఎలా చేరవేయాలో నేర్చుకుంటున్నారు. ఎంపీడీవో, గ్రామ కార్యదర్శి మరియు వార్డు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.