KMR: దోమకొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరడంతో నూతన భవనం మంజూరు చేయాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని సర్పంచ్ ఐరేనీ నర్సయ్య శుక్రవారం కోరారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి భవనం మంజూరుకు కృషి చేస్తానని షబ్బీర్ అలీ హామీ ఇచ్చారు.