HYD: బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా తెలంగాణ జాగృతి కార్యాలయంలో జాగృతి అధ్యక్షురాలు కవిత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సంక్షోభం నుంచి దేశాన్ని సక్సెస్ వైపు నడిపించిన మహోన్నతుడు, అణగారిన, పీడిత వర్గాలకు మార్గదర్శకుడు బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు.