NLG: కేతేపల్లి మండల కేంద్రంలోని తుంగతుర్తి, కొప్పల్ గ్రామంలో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర పొందారన్నారు, తక్కువ తేమశాతం ఉండేవిధంగా చూసుకోవాలని కోరారు. వారి వెంట మార్కెట్ కమిటీ ఛైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.