W.G: కాళ్ల మండలం వేంపాడులో ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి అలుపెరుగనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉండి డీసీ ఛైర్మన్ తోట ఫణిబాబు, కూటమి నాయకులు భారీగా పాల్గొన్నారు.