GNTR: తెనాలి పట్టణ పరిధిలోని సీబీఎన్ కాలనీలో ట్యాంకు వద్ద పైపు లైన్ లీకు ఏర్పడిన కారణంగా సోమవారం పలు వార్డుల్లో మంచినీటి సరఫరా నిలిచిపోతుందని కమిషనర్ రామ అప్పలనాయుడు తెలిపారు. పట్టణంలోని 21, 22, 23 వార్డులకు ఉదయం నుంచి మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.