SKLM: మందసలోని పెద్ద కేసుపురంలో ఆదివారం పిడుగుపాటుకు తల్లి, కుమార్తె మృతి చెందారు. గ్రామానికి చెందిన కృష్ణవేణి (35), కుమార్తె చిన్ని (15) జీడీ తోటలో పనులు చేస్తున్నారు. సాయంత్రం వాతావరణంలో మార్పులు చోటుచేసుకొని బలమైన ఈదురు గాలులు వీచాయి. ఈ క్రమంలో పెద్ద శబ్దంతో పిడుగు అకస్మాత్తుగా వారు పనిచేస్తున్న తోటలో పడగా అక్కడికక్కడే మరణించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.