హన్మకొండ: జిల్లా పరిధిలోని సాంఘిక సంక్షేమ కళాశాల వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎంపీ కడియం కావ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంద కుమార్ మాట్లాడుతూ.. హాస్టళ్లలో విద్యార్థులు తాగునీరు, ఆహారం, పరిశుభ్రత, భద్రత వంటి ప్రాథమిక సౌకర్యాల కొరతతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.