PDPL: హామీల అమలులో విఫలమైన సీఎం రేవంత్ రెడ్డి ప్రజల దృష్టిని మరల్చేందుకే బీఆర్ఎస్ అగ్ర నేతల క్యాంపు కార్యాలయాలపై కాంగ్రెస్ నాయకులతో దాడులు చేయిస్తున్నారని మంథని మాజీ MLA పుట్ట మధుకర్ ఆరోపించారు. మంథనిలో విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేశారు.