కోనసీమ: ఆలమూరు మండలంలో 1000 ఎకరాల్లో సాగైన బొండాల ధాన్యం, రికార్డుల్లో 70 శాతం సన్నాళ్లుగా నమోదు కావడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల బస్తాకు రూ.200 వరకు నష్టం వాటిల్లుతోందని ఆవేదన చెందుతున్నారు. వ్యవసాయ అధికారుల తీరుపై స్థానిక నేతలు మండిపడుతున్నారు. తక్షణమే రికార్డుల్లోని లోపాలను సరిదిద్దాలని కోరుతున్నారు.