MBNR: ప్రజలు శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలని మహబూబ్నగర్ రూరల్ సీఐ గాంధీ నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్ కాలనీలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉగాది రంజాన్ పండుగలను స్నేహపూర్వక వాతావరణంలో జరుపుకున్నారని అదేవిధంగా రాబోయే బక్రీద్ హనుమాన్ జయంతి శ్రీరామనమే వేడుకలు కూడా జరుపుకోవాలని సూచించారు.