NLG: నల్గొండ జిల్లా గంధంవారిగూడెం SLBC గురుకుల పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థినులు జేఈఈ మెయిన్స్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. మట్టిలో మాణిక్యాల్లా మెరిసిన ఈ విద్యార్థినులను ప్రిన్సిపల్ లలితా కుమారి, వడ్డేపల్లి నాగరాజు గురువారం ఘనంగా సన్మానించారు. పట్టుదలతో శ్రమిస్తే అద్భుతాలు సాధించవచ్చని వారు ఈ సందర్భంగా విద్యార్థులను కొనియాడారు.