NRPT: జిల్లాలో రైతుల ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 65.03 శాతం పూర్తయ్యింది. మొత్తం 1,84,713 మంది పట్టాదారుల్లో 1,20,120 మంది ఇప్పటికే నమోదు చేసుకోగా, ఇంకా 64,593 మంది రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లో 4,59,000 ఎకరాల భూమి ఉండగా, అందులో 4,25,000 ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉన్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.