KNR: కరీంనగర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆదివారం నిర్వహించిన అంతర్గత చదరంగం పోటీలకు విశేష స్పందన లభించింది. సుమారు 80 మంది విద్యార్థులు తమ మేధాశక్తిని ప్రదర్శించారు. ఈ సందర్భంగా దాసరి శ్రీపాల్ రెడ్డి, జీనియస్ చెస్ అకాడమీ కోచ్ అనూప్ కుమార్ మాట్లాడుతూ.. చదరంగంతో విద్యార్థుల్లో ఏకాగ్రత, ఆలోచనాశక్తి పెరుగుతాయని అన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.